మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను దొరికిన విధానం మాత్రం ఇప్పుడు చాలా విడ్డూరంగా ఉంది. ఇంత జరుగుతున్నా సరే అతను ధైర్యంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహంకాళి దేవస్థానం వద్దకు వెళ్ళడం, దర్శనం కు ఏర్పాట్లు చేసుకోవడం అన్నీ కూడా సంచలనంగా మారాయి. 

 

అతను అక్కడికి వెళ్లి నేనే వికాస్ దూబే అని అరవడం అతన్ని గుర్తించిన  ఆల్య భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని చాలా జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేసారు. గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: