ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులను కాన్పూర్ జిల్లాలో కాల్చి చంపి అక్కడి నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని మధ్యప్రదేశ్ లో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు అతని ముగ్గురు అనుచరులను పోలీసులు కాల్చి చంపినా సంగతి తెలిసిందే. ఇక ఆ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే తను పోలీసులకు దొరికిపోయాడు. 

 

దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్  మంత్రి నరోత్తం మిశ్రా... ఇది పోలీసులకు పెద్ద విజయ౦గా అభివర్ణించారు. “వికాస్ దుబే క్రూరమైన కిల్లర్. మొత్తం మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అతన్ని ఉజ్జయిని మహాకల్ ఆలయంలో అరెస్టు చేశారు. మేము ఉత్తర ప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. అతన్ని రేపు లేదా నేడే ఉత్తరప్రదేశ్ తరలించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: