దేశ వ్యాప్తంగా రెండు రోజులు తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మరోసారి భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరోసారి 25 వేల కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 24 వేల 879 కరోనా కేసులు 487  మరణాలు నమోదు అయ్యాయి.  ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షల 67 వేల 296 కి చేరుకున్నాయి. 

 

 ఇక మరణాలు కూడా 21 వేలు దాటాయి. ఇప్పటి వరకు 21 వేల 129 మంది కోరనా కారణంగా మరణించారు. దేశంలో యాక్టివ్ కేసులు 2 లక్షల 69 వేలకు పైగా ఉన్నాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. అక్కడ ఇప్పటికే 2 లక్షల 30 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: