రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. విశాఖ సాగర తీరంలో సముద్రం కోతను నివారించడానికి గానూ సన్ రే ఆధ్వర్యంలో మంత్రి అవంతి తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. నౌపాక మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయన అన్నారు.

 

నౌపాక మొక్కలను బీచ్‌లో నాటడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా మొక్కలు దోహద పడతాయన్న ఆయన.... విశాఖలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. ఇక మంత్రి అవంతి మాట్లాడుతూ పర్యాటకులకు విశాఖ స్వర్గ ధామం అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: