ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ లో ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఎవరు ఉండవచ్చు అనే దాని మీద ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇక తాజాగా నలుగురిని అరెస్ట్ చేసారు. మొత్తం ఈ వ్యవహారంలో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

డ్రగ్స్ ని నెదర్లాండ్ నుంచి కొంటున్న భాను చందర్ కాల్ డేటా తో పాటుగా బ్యాంక్ లావాదేవీల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం 15 మంది వీటిని విక్రయిస్తున్నారు అని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయి తో పాటుగా మరికొన్ని డ్రగ్స్ 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: