మాస్క్ అనేది ఇప్పుడు మన ప్రాణాలను కాపాడే ఒక ఆయుధం. మాస్క్ లేకుండా బయటకు వస్తే ప్రాణాలు పోయినట్లే కరోనా బారిన పడినట్లే అనే హెచ్చరికలు చాలా మంది చేస్తున్నారు. అయితే మాస్క్ లను వాడే విషయంలో మాత్రం చాలా మంది ముందుకు రావడం లేదు. 

 

ఈ తరుణంలో తమిళనాడులోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ ల ఆకారంలో తయారు చేసిన పరోటాలను అందిస్తోంది. సదరు హోటల్  మేనేజర్ పూవ లింగం మాట్లాడుతూ... "మదురై ప్రజలు ముసుగులు ధరించడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజల్లో మాస్క్ గురించి అవగాహన కల్పించడానికి గానూ తాము మాస్క్ పరోటాను తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి మంచి స్పందన వస్తుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: