మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని నేడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అతని తల్లి సరళా దేవి స్పందించారు. అతని (వికాస్ దుబే) అత్తమామలు మధ్యప్రదేశ్‌లో ఉన్నారని ఆమె మీడియాతో మాట్లాడుతూ  వ్యాఖ్యానించారు. అతను ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి  ఆలయాన్ని సందర్శిస్తాడని ఆమె పేర్కొన్నారు.

 

నేను ఏమి చెప్పినా సరే ప్రభుత్వం తగినది చేయబోతోందని, ప్రభుత్వం ఎం చేసినా సరే పరవాలేదని ఆమె అన్నారు. అరెస్ట్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. అతను ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: