సూర్యాపేట జిల్లాలో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో భూమి కంపించింది. స్వల్పంగా భూమి కంపించడం తో అక్కడ ఉన్న స్థానికులు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసారు. అయితే దాని తీవ్రత అంతగా లేదు అని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నారు. 

 

అయితే దాని తీవ్రత ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వరుస భూకంపాలు వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు వచ్చాయి. అయితే అవి తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: