ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,555 మంది వైరస్ భారీన పడ్డారు. వీరిలో రాష్ట్రానికి చెందిన వాళ్లు 1,500 మంది కాగా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు 55 మంది ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 13 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 23,814కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,383 యాక్టివ్ కేసులు ఉండగా 12,154 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 277 మంది వరకు వైరస్ భారీన పడి మృతి చెందారు. ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: