తమిళనాడులోని చెన్నై లో దారుణ హత్య చోటు చేసుకుంది. అద్దె ఇవ్వాలని యజమాని అడిగినందుకు ఏకంగా యజమానినే హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.
నాలుగు నెలల అద్దె కట్టాలని అద్దెకు ఉంటున్న ధనరాజ్ అనే వ్యక్తి తో గొడవ పడ్డాడు యజమాని . ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన ధనరాజ్ కుమారుడు అజిత్ ఇంటి యజమాని పై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఇక అప్పటికే తీవ్ర గాయాలపాలైన గుణశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలారు.