ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నారు. రాక్‌లైన్ వెంక‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు నిర్మించారు. ఆయ‌న న‌టుడు కూడా. రాం గోపాల్ వ‌ర్మ కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాలో ఆమ‌న మైసూర్ ఎస్పీగా కూడా న‌టించారు. ఆయ‌న శ్వాస స‌మ‌స్య‌ల‌తో హాస్పట‌ల్లో చేరిన‌ట్టు చెపుతున్నా ఆయ‌న ఇటీవ‌ల క‌రోనా సోకిన సీనియ‌ర్ హీరోయిన్‌, మండ్య ఎంపీ సుమ‌ల‌త‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌న్న సందేహాలు అయితే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

ఇక రాక్‌లైన్ వెంక‌టేష్‌కు వృత్తిరీత్యా డాక్టరైన కుమారుడు డాక్టర్ అభిలాష్ చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఇక వెంక‌టేష్ దివంగ‌త న‌టుడు, మాజీ మంత్రి, సుమ‌ల‌త భ‌ర్త అయిన అంబ‌రీష్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు  సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. ఇప్పుడు సుమ‌ల‌త‌కు క‌రోనా రావడంతో ఆయ‌న‌కు కూడా క‌రోనా వ‌చ్చింద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: