టాలీవుడ్, కోలీవుడ్ లలో అనేక చిత్రాలు నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు కరోనా నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం మాండ్య ఎంపీ సుమలతతో కలిసి ఈయన కర్ణాటక సీఎంను కలిశారు. సుమలతకు కరోనా నిర్ధారణ అయిన కొన్ని రోజులకే ఈయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయినట్లు కన్నడ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఈ వార్తలపై రాక్ లైన్ వెంకటేష్ స్పందించాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వెంక‌టేష్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని సమాచారం. ద‌ర్శ‌న్ పాత్ర‌లో రూపొందుతున్న రాజావీర మ‌ద‌క‌రి నాయ‌క అనే చిత్రంతో రాక్ లైన్ వెంకటేష్ బిజీగా ఉన్నారు. 2021 ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: