కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు ఇలా ఉన్నాయి.
- నాన్ క్రిటికల్ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా నిర్ధారించింది.
- క్రిటికల్ కోవిడ్-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.
- ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్ చేయనున్నారు.
- వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు.
- ఇన్ఫెక్షన్ ఉన్న వారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది.
- ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు.
- ఆరోగ్య శ్రీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.