కర్ణాటకలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలందరూ భయాందోళనలు చెందుతున్నారు. అయితే ముందుముందు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని భావించిన కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామి స్టేడియం తోపాటు బెంగళూరు ప్యాలెస్ ను కూడా కరోనా వైరస్ కేర్ సెంటర్ గా మార్చేందుకు కర్ణాటక సర్కారు నిర్ణయించింది.
అంతేకాకుండా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ను కూడా కరోనా సెంటర్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేసులు పెరిగినప్పటికీ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది అంటూ తాజాగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.