ఇటీవలే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసం అయిన రాజ్ నివాస్ లో పనిచేసే ఉద్యోగి కరోనా పాజిటివ్ రావడంతో... గవర్నర్ కిరణ్ బేడి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిరణ్ భేడి కరోనా నెగిటివ్ అని వచ్చినట్లు తెలుస్తోంది.
కిరణ్ బేడీ కరోనా పరీక్షలు నిర్వహించుకోగా.. నెగిటివ్ అని వచ్చిందని తాజాగా గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ కార్యాలయం లో కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.