దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ని గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా గోదాంలో ని ఎలక్ట్రానిక్ వస్తువులు లైట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా 35 ఫైర్ ఇంజన్ల సాయంతో ఎంతగానో శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం ఎలా సంభవించింది అన్నదానిపై ప్రస్తుతం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.