కరోనా పరీక్షల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 16882 నమూనాలు పరీక్షించగా 1500 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 900 మంది కరోనా నంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా పరీక్షల్లో ఏపీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో ఏకంగా ఇప్పటికే 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు తాజాగా గురువారంతో 11 లక్షలకు చేరువ అయ్యాయి.
ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న పరీక్షలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదు. ముందు నుంచే పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ చాలా దూకుడుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్నా వెంటనే వైద్యం అందిస్తున్నారు.