ఆంధ్రప్రదేశ్ లో సున్నా వడ్డీ విషయంలో ఏపీ సర్కార్ దూకుడుగానే ఉంది. ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా సరే సున్నా వడ్డీ  రుణాలను  రైతులకు  అందించాలి అని భావిస్తుంది సిఎం జగన్ సర్కార్. గత  ప్రభుత్వ బకాయిలను కూడా ఏపీ సర్కార్ రైతులకు అందిస్తుంది. దీనిపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

 

తాజాగా దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. సున్నా వడ్డీ సొమ్ము ఇకపై నేరుగా రైతుల ఖాతాల్లోకే పంపిస్తోంది జగన్ గారి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలను సైతం చెల్లిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు జగన్ గారు. పంటల కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇది ముమ్మాటికీ రైతు ప్రభుత్వం. రైతులను దగా చేసిన వారు రైతుదగా దినోత్సవమంటున్నారని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: