మహారాష్ట్ర రాజధాని దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబై లో కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడిలో ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే ప్రతీ ప్రాంతంలో భారీగా కేసులు ఉన్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే... ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 9 కొత్త  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో మొత్తం  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 2347 గా ఉందని బృహన్ ముంబై కార్పోరేషన్ ప్రకటించింది. 86 మంది కరోన కారణంగా మరణించారు అని  బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కాసేపటి క్రితం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: