ఏడాది క్రితం సిఎం జగన్  ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఖర్చు పై ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని ఆధారాలతో పోస్ట్ చేసారు. “డ‌బ్బులు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్ర‌జ‌ల సొమ్ము సీఎం నీళ్ల‌ పాలు.

 

సీఎం ఒక మీటింగ్‌లో తాగిన వాట‌ర్‌ బాటిళ్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు ఖ‌రీదు అక్ష‌రాలా 43.44 ల‌క్ష‌లు. ఒక్క‌ రోజులో ఇంత తాగారంటే అది అమృత‌మైనా అయ్యుండాలి, లేదంటే స్కామైనా చేసుండాలి. అని ఆయన ఒక ట్వీట్ చేసారు. ఏడాది క్రితం వైఎస్ జగన్ ప్ర‌మాణ‌స్వీకారం రోజున‌ వాట‌ర్ బాటిల్స్‌, స్నాక్స్‌కి 59.49 లక్షలు బిల్లు అయ్యింద‌ట‌! తిన్న‌వి స్నాక్సా? క‌రెన్సీ నోట్లా జ‌గ‌న్‌రెడ్డి గారూ అని ట్వీట్ చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: