గత కొంతకాలం నుంచి దేశంలో పలుచోట్ల నిత్యం భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి భయపడుతునే.. ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు ప్రజలు.
తాజాగా మిజోరంలో భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి నష్టం వాటిల్లదని. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.3 నమోదైనట్లు అధికారులు తెలిపారు.