తమిళనాడులో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 4,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,26,581కి చేరింది. తమిళనాడులో ప్రస్తుతం 46,652 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 65 మంది మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 46,652 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం చెన్నై నగరంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందువరుసలో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: