ఏపీ ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ స్కాం మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈరోజు సాయంత్రం పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. 
 
పితాని కుమారుడితో పాటు పితాని దగ్గర అప్పట్లో పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ కూడా మురళీమోహన్ కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు అచ్చెన్నాయుడు సహా తొమ్మిది మందిని ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేయగా పితాని సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: