దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మరో 4వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు.

 

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 6,875 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,067 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి, మరణాలు 9,667కు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,27,259 మంది కోలుకున్నారు. 93,652 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: