కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) చేతికి వెళ్లింది. ఈ మేరకు ఎన్​ఐఏకు అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంగారం స్మగ్లింగ్‌.. జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటం వల్ల ఈ కేసును ఎన్​ఐఏకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. గతవారం గల్ఫ్‌ నుంచి ఎయిర్‌ కార్గో ద్వారా వచ్చిన దౌత్య పార్శిల్‌లో 15 కోట్లు విలువ చేసే 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

 


ఈ వ్యవహారంతో సీఎంవో అధికారికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావటం వల్ల..సీఎం పినరయి విజయన్‌ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్‌కు సీఎం కార్యాలయం ప్రిన్సిపల్‌ కార్యదర్శి శివశంకర్‌ సహకరించినట్లు ఆరోపణలు రావటం వల్ల ఆయన్ను పదవి నుంచి తప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: