ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష నగదు రివార్డు ఉన్న నలుగురు నక్సల్స్​ ఉన్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన పునరావాస చర్యలు వారిని ప్రభావితం చేసినట్లు ఆయన వెల్లడించారు.

 

కౌకొండ పోలీస్​ స్టేషన్​లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టులతో సహా 25 మంది లొంగిపోయారు. ప్రకాశ్ కర్తామీ (పండు), హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఎదుట సరెండర్​ అయ్యారు.ప్రస్తుతం లొంగిపోయిన నక్సల్స్​ చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు అధికారి తెలిపారు. 2016 మార్చిలో ఏడుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు చనిపోయన మెయిల్​వాడా మందుపాతర దాడితో వీరికి సంబంధం ఉందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: