రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్​ కింద రూ.656.25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్​ సంస్థలకు ఈ నిధులు విడుదలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతగా రూ.656.25 కోట్ల నిధులు విడుదలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పంచాయతీ రాజ్ సంస్థలకు ఈ గ్రాంట్ విడుదల చేసినట్లు ప్రకటించింది. గ్రామ పంచాయతీలు, మండల్ ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులకు ఈ నిధులు కేటాయించనున్నారు. అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించుకునే సదుపాయం ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: