ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని ఆ రాష్ట్ర పోలీసులు కాల్చి చంపారు. అతన్ని ఉత్తరప్రదేశ్ కాన్పూర్ తరలిస్తున్న సమయంలో వాహనం బోల్తా పడటం తో దారిలోనే అతను తప్పించుకునే ప్రయత్నం చేసాడు. అయితే అనూహ్యంగా  అతను ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేయగా అతన్ని కాల్చి చంపారు పోలీసులు. 

 

అతన్ని మొత్తం 13 కార్లలో పోలీసులు తరలిస్తున్నారు. దాదాపు 200 మంది పోలీసులు అతన్ని తరలిస్తున్నారు. ఈ క్రమంలో సాధ్యం కాకపోయినా సరే అతను తప్పించుకునే ప్రయత్నం చేసాడు అని అంటున్నారు. వికాస్ దూబేను శుక్రవారం ఉదయం 10 గంటలకు కాన్పూర్ కోర్టులో హాజరు పర్చాలని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ భావించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: