వికాస్ దూబే... గత వారం రోజుల నుంచి రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న గ్యాంగ్ స్టర్ ని ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో అతన్ని నిన్న అరెస్ట్ చేసి అక్కడి నుంచి కాన్పూర్ తరలించాలి అని భావించారు పోలీసులు. అయితే మార్గ మధ్య కారు బోల్తా పడింది. 

 

ఇదిలా ఉంటే అతన్ని కోర్ట్ లో 10 గంటలకు హాజరు పరిచి రిమాండ్ కి తరలించాలి అని పోలీసులు భావించారు. 60 కేసుల్లో నిందితుడు దూబే. కాగా అతని కీలక అనుచరులు కూడా  పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఇక ఇప్పుడు అతన్ని కూడా పోలీసులు కాల్చి చంపారు. కాగా వాహనం బోల్తా పడటంతో దాదాపుగా  నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: