నిన్న మధ్య ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని  ఉత్తరప్రదేశ్ పోలీసులు నేడు కాల్చి చంపారు. ఉదయం ఆరు గంటల సమయంలో అతన్ని తరలిస్తున్న వాహనం బోల్తా పడగా అతను అందులో నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు కాల్చి చంపేశారు. 

 

ఇదిలా ఉంటే అతన్ని కాల్చి చంపినా అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ తూర్పు జిల్లా ఎస్పీ... కారు బోల్తా పడటంతో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని లొంగిపోయే ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సమయంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డాడు అని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: