గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. అతన్ని ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న సమయ౦లో వాహనం బోల్తా పడగా... ఆయుధాలు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో కాల్చి చంపారు. 

 

అయితే ఇక్కడ పోలీసుల ప్రకటన అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసుల పిస్టల్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను గాయపడ్డాడు ఆస్పత్రికి తరలించాం అని చెప్పిన పోలీసులు ఆస్పత్రికి తరలించక ముందే అతను చనిపోయాడు అని మీడియా ముందు ప్రకటన చేసారు. దీనితో పోలీసుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: