ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా బలహీనపడుతున్న మావోలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా నలుగురు మావోలను పోలీసులు కాల్చి చంపారు. బీహార్‌లోని పష్చిమ్ చంపారన్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. బాగహా ప్రాంతంలో సాశాస్త్రా సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సంయుక్త బృందం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.

 

ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారని లోకారియా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇక నలుగురు నక్సల్స్ కూడా యువకులే అని వారు జార్ఖండ్ కి చెందిన వారు అని అధికారులు తెలిపారు. కాగా ఈ ఎన్కౌంటర్ లో ఒక కీలక నేత కూడా మరణించారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: