ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అతన్ని మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కి తరలిస్తున్న సమయంలో వాహనం బోల్తా పడగా అందులో నుంచి అతను పారిపోయే ప్రయత్నం చేయగా అప్రమత్తం అయిన పోలీసులు అతన్ని కాల్చి చంపారు. 

 

అతను పోలీసుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కుని కాల్చాడు అని ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి అని పోలీసులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వారిని ప్రత్యేక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని కాన్పూర్ ఎస్పీ పేర్కొన్నారు. ఇక ఈ కాల్పుల్లో వికాస్ దూబే అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు అని సమాచారం. అతన్ని నిన్న అరెస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: