ఆంధ్రప్రదేశ్ లో అవినీతి విషయంలో సిఎం వైఎస్ జగన్ దూకుడు గురించి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏ మాత్రం కూడా అవినీతిని సహించే పరిస్థితి లో లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అవినీతి విషయంలో ఆయన గత ప్రభుత్వాన్ని ఇప్పుడు బయటకు లాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే గతంలో మంత్రులుగా చేసిన వారి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.” అని ట్వీట్ చేసారు.
జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 10, 2020