దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతీ రోజు మరణాలు కూడా 450 పైగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ గత 24 గంటల్లో తన ప్రతాపం చూపించింది. 24 గంటల్లో 26 వేల 506 కేసులు 475 మరణాలు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 7,93,802 గా ఉన్నాయి. వీటిలో 2,76,685 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుంచి దేశ వ్యాప్తంగా 4,95,513 మంది కోలుకుని బయటపడ్డారు. 21,604 మంది దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు లక్ష దాటాయి.