టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లు గా వస్తున్న చిత్రం రాధే శ్యాం. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. 

సోషల్ మీడియాలో విడుదల చేయగా ఇందులో పూజ హెగ్డే ప్రభాస్ కలిసి  కనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ ని చూపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇటీవల ప్రభాస్ 10 వ తేదీ 10 గంటల పది నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: