ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇటీవల 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళగా అతను తప్పించుకునే ప్రయత్నం చేయడం పోలీసులను కాల్చి చంపడం జరిగింది. నిన్న అతన్ని మధ్యప్రదేశ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే అతన్ని పోలీసులు కాల్చి చంపడంపై అతని కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ జితేంద్ర పాల్ సింగ్ తండ్రి తీరత్ పాల్ స్పందించారు. “యుపి పోలీసుల పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు వారు చేసిన పనులన్నీ నా ఆత్మకు ఓదార్పునిచ్చాయి. యోగి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అయన పేర్కొన్నారు.