ఉత్తరప్రదేశ్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ తీసుకుని వెళ్తున్న సమయంలో అతన్ని తరలిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడటంతో అతను తప్పించుకునే ప్రయత్నం చేయడం కాల్చి చంపడం జరిగాయి. ఇది ఇలా ఉంటే ఎన్కౌంటర్ ముందు వరకు మీడియాను అనుమతించిన పోలీసులు, ఆ తర్వాత మీడియాను కాల్పులు జరిగిన తర్వాత అనుమతించారు. 

 

వికాస్ దుబేను తిరిగి తీసుకువచ్చే కాన్వాయ్ ను అనుసరిస్తున్న మీడియా వ్యక్తులను కాన్పూర్ లోని సచేండి ప్రాంతంలో ఉదయం 6.30 గంటలకు ఎన్‌కౌంటర్ కు ముందే పోలీసులు ఆపారని జాతీయ మీడియా పేర్కొంది. అతని మృతదేహాన్ని తల్లి తండ్రులకు అప్పగించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: