ఒక పక్క అక్రమ మద్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల నుంచి ఎపీకి అక్రమంగా మద్యం వెళ్తూనే ఉంది. కఠిన నిర్ణయాలు పోలీసులు తీసుకుంటున్నా సరే కొందరు మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా  మైలవరం లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. 

 

కృష్ణా జిల్లా మైలవరానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైలవరంలోని, ఎల్బీఆర్‌సీఈ సమీపంలో 205 మద్యం బాటిళ్లను... రాజపేటలో, 200 మద్యం బాటిళ్లను  పోలీసులు పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటో తో పాటుగా మూడు బైక్‌‌లను వారి వద్ద నుంచి అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అక్కడి నుంచి పరారు కాగా ముగ్గురుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: