మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సౌర ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవాలోని ఈ సోలార్ ప్లాంట్‌తో ఇక్కడి పరిశ్రమలకు విద్యుత్ లభించడమే కాదు,

 

ఢిల్లీలోని మెట్రో రైలు కూడా దాని ప్రయోజనాలను పొందుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రేవాతో పాటుగా షాజా పూర్, నీముచ్ మరియు ఛతార్‌ పూర్‌లోని సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. ఇక ఇది దేశంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: