ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో ఇసుక మద్యం అక్రమ రవాణా విషయంలో  ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆగడం లేదు. ఇప్పుడు దీనిపై సిఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారు అని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అక్రమ మద్యం తరలింపు తీవ్రత ఆధారంగా  జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. 

 

ఏడాది నుంచి రెండేళ్ళ  వరకు  జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఈ మేరకు ఒక ఆర్డినెన్స్  ని తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. రోజు రోజుకి తీవ్రం కావడంతో ఈ ఆర్డినెన్స్ ని అమలు చెయ్యాలని భావిస్తున్నారు.  ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట మద్యం దొరుకుతూనే ఉంది. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలను రెడీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: