దేశంలో ఓ వైపు కరోనా తో నానా తంటాలు పడుతుంటే.. ఓ వైపు చైనా మరోవైపు పాకిస్థాన్ బార్డర్ లో భారత సైన్యంపై పలు మార్లు దాడులకు చేయడం మన సైనికులు తిప్పికొట్టడం చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశంలోె నక్సల్స్ పలు చోట్ల దాడులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో పలుమార్లు భద్రతాదళాలాలు.. మావోయిస్టుల మద్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా బీహార్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బాగహా ప్రాంతంలో సశస్త్ర సీమాబల్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని పోలీసులు వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.