ప్రపంచం మొత్తం కరోనాతో బాధపడుతుంటే.. చైనా, పాకిస్థాన్ లు మాత్రం భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఓ వైపు స్నేహ హస్తాన్ని చాపుతూనే ఈ రెండు దేశాలు భారత సైన్యం పై పలుమార్లు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా భారతదేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. భారత బలగాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడుతున్నది. జమ్ములోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ రోజు ఉదయం పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాన్‌ మృతిచెందారు.

 

సరిహద్దు వెంట పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో హవిల్దార్‌ సంబూర్‌ గురుంగ్‌ తీవ్రంగా గాయపడ్డారు కాల్పుల్లో గాయపడ్డ జవాన్ని ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందారని లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ వెల్లడించారు.  జమ్మూకాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పదే పదే కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు. గత ఏడాది పుల్వామా తరహా దాడులకు యత్నాలు చేస్తున్నారు. కానీ భారత సైన్యం వారి పన్నాగాలను ఎప్పటికప్పుడు పసికడుతూ.. తిప్పి కొడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: