కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా ఆమె వద్ద రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.  ఈ సందర్భంగా రాములవారి విగ్రహాన్ని కూడా ఆమెకు బహుకరించారు ఆయన. దాదాపు అర గంట పాటు ఆమె తో భేటీ అయ్యారు బుగ్గన. కాసేపట్లో ఆయన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఆయనతో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల నిర్మల ఏపీ వచ్చి కాస్త ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఈ తరుణంలో... ఆమెను బుగ్గన కలవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: