ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ పై సర్వత్రా ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికాస్ దూబే ని తీసుకొచ్చిన వాహనం అదే విధంగా పల్టీ కొట్టిన వాహనం ఒకటి కాదని రెండు వాహనాలు వేరు వేరు అని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయింది. 

 

దూబే కు పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలను బయటకు లాగాలని ఈ మేరకు కేసుని సిబిఐ కి అప్పగించాలి అని డిమాండ్లు వినపడుతున్నాయి. అదే  పిటీషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ముందు అతనికి రోడ్డు ప్రమాదం లో గాయాలు అయ్యాయి అని, ఆ తర్వాత అతన్ని 5 నిమిషాలకు ఎన్కౌంటర్ చేసామని పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు కూడా చంపేశారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: