సిఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు విపక్షాలు ఏదోక రూపంలో విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే హైకోర్ట్  లో ఒక పిటీషన్ కూడా దాఖలు చేసారు. ఈ పిటిషన్‌ను విచారించలేమంటూ స్పష్టంగా చెప్పింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్‌ను హెచ్చరించింది. 

 

సిఎం కనిపించకపోతే హెబియస్ కార్ప్ దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని ఈ సందర్భంగా పేర్కొంది. తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హైకోర్ట్ కి వెళ్ళారు. ఈ సందర్భంగా హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా సిఎం కేసీఆర్ కి కరోనా వచ్చింది అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: