ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,608 కొత్త కేసులు నమోదు కాగా 15 మంది మృతి చెందారు. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కరోనా భారీన పడ్డారు. గన్ మెన్ కు కరోనా సోకడంతో రోజా హోం క్వారంటైన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. గన్ మెన్ కు కాంటాక్ట్ లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. 
 
రోజా త్వరలో కరోనా పరీక్షలు చేయించుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రోజా గన్ మెన్ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజా ఇటీవల మాస్క్ లేకుండానే 108 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన గన్ మెన్ గత కొన్ని రోజుల నుంచి విధులకు హాజరు కావడం లేదని 
రోజా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: