ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో సిఎం జగన్ ఏ విధంగా దూసుకుపోతున్నారో అందరికి తెలిసిందే. కరోనా కష్టాలు ఉన్నా ఆర్ధికంగా నానా ఇబ్బందులు పడుతున్నా సరే ఇళ్ళ పట్టాలు పంచె విషయంలో మాత్రం సిఎం వెనక్కు తగ్గడం లేదు. ఇక దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. 

 

ఇల్లు లేని కుటుంబం ఆంధ్రాలో ఉండకూడదన్నదే జగన్ గారి ఆలోచన అన్నారు ఆయన. పేదలకిచ్చే 30 లక్షల ఇళ్ల స్థలాల విషయంలో సంకుచిత ఆలోచనలు ఆపండని సూచించారు. ఒకసారి ఎక్కువ రేటుకు కొన్నారంటారు, మరోసారి ఊరు చివర అంటారని ఆయన మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలతో విష బీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పచ్చ నేతలు అని ఆయన ఆరోపించారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: