మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేసే పోలీసులే అక్కడ భారీగా కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకి అక్కడ పోలీసులు  కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మరోసారి భారీగా పోలీసులు కరోనా బారిన పడ్డారు.

 

గత 48 గంటల్లో రాష్ట్ర పోలీసు శాఖలో 222 మంది పోలీసులకు కరోనా సోకినట్టు వెల్లడి అయింది. ముగ్గురు పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,935 గా ఉంది, ఇందులో 74 మంది మరణించారు మరియు 4,715 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: