ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందాలి అని సిఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆయన  శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో... ప్రభుత్వ పథకాల ద్వారా ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి త్వరగా సాయం అందేలా చర్యల తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. 

 

గత నెల ప్రారంభించిన వాహన మిత్ర వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలు అందరికి అందాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి పథకాలను వర్తింపజేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. గతేడాది డిసెంబర్ తర్వాత మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి సైతం నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: